వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court directs Telangana government to submit all documents in Vaman Rao couple murder case. Next hearing postponed by four weeks.

నాలుగేళ్ల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన వామనరావు-నాగమణి దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2021 ఫిబ్రవరి 27న న్యాయవాది గట్టు వామనరావు, నాగమణి దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అన్ని రికార్డులను తమ ముందుంచితే వాటిని పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి మూడు వారాల్లో రికార్డులు సమర్పించాలని ఆదేశించింది.

ఇప్పటికే ఈ కేసుపై గతంలో కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించింది. సీబీఐ తరఫున న్యాయవాది మాట్లాడుతూ, కోర్టు ఆదేశిస్తే విచారణ చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉందని కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం అన్ని ఆధారాలను సమర్పించిన అనంతరం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *