Wednesday, March 18, 2026
No menu items!
spot_img
HomeAndhra PradeshPolavaram Project | పోలవరం పనులు వేగవంతం.. నిర్వాసితులకు భారీ ప్యాకేజీ

Polavaram Project | పోలవరం పనులు వేగవంతం.. నిర్వాసితులకు భారీ ప్యాకేజీ

- Advertisement -
Google search engine

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై వారికి భరోసా కల్పించారు. ఉగాది సందర్భంగా పునరావాస ప్యాకేజీ మూడో విడతగా రూ.226 కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు జీవనాడిగా మారుతుందని, నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

గత పాలనలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని, డయాఫ్రాం వాల్ దెబ్బతిన్నదని చెప్పారు. ప్రస్తుతం నిపుణుల సలహాలతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

గత 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లకు పైగా చెల్లించామని, సంక్రాంతి, దీపావళి సందర్భాల్లో కూడా విడతలుగా నిధులు విడుదల చేసినట్లు వివరించారు.

మొత్తం 38,068 మంది నిర్వాసితులు మొదటి దశలో ఉన్నారని, 75 కాలనీలలో 26 పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షలు, స్థలానికి రూ.2 లక్షలు అందిస్తున్నామని వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.5 వేల కోట్లు అవసరమని, 2026 నాటికి నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

నిర్వాసితులు దళారులను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు, భూములు త్యాగం చేసిన నిర్వాసితులు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని సీఎం అన్నారు.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

- Advertisement -