Wednesday, March 11, 2026
No menu items!
Home Andhra Pradesh రత్నాలచెరువు వాసులకు లోకేష్ చేత శాశ్వత పట్టాలు

రత్నాలచెరువు వాసులకు లోకేష్ చేత శాశ్వత పట్టాలు

0
11
After 43 years of waiting, Ratnalacheruvu residents received permanent house titles from Lokesh, ending fear and bringing joy.
After 43 years of waiting, Ratnalacheruvu residents received permanent house titles from Lokesh, ending fear and bringing joy.

మంగళగిరి రత్నాలచెరువు వాసులు గత నాలుగు దశాబ్దాలుగా ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇళ్లను ఎప్పుడైనా తొలగిస్తారనే భయంతో జీవనం గడిపారు. ప్రభుత్వాల మార్పు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఎప్పటికైనా శాశ్వత స్థిర నివాసం కలుగుతుందనే ఆశతో వేచిచూశారు.

గతంలో పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను ఆశ్రయించినా పట్టాలు ఇవ్వలేమని, ఇళ్లను తొలగించవలసి ఉంటుందనే సమాధానమే వచ్చేది. దీంతో అక్కడి ప్రజలు రోజూ భయంతో జీవించారు. తాము నిర్మించిన ఇళ్లను ఎప్పుడైనా కోల్పోతామన్న ఆందోళన వారిని వెంటాడింది.

ఇటీవల నారా లోకేష్ మంగళగిరిలోని రత్నాలచెరువు ప్రాంతాన్ని సందర్శించి, పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి, అక్కడి వాసులకు శాశ్వత ఇంటి పట్టాలు అందించారు. decades-old demand‌కు పరిష్కారం చూపిన లోకేష్‌పై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మేలు చేసే వారే నిజమైన నాయకులంటూ ఆయనను కొనియాడుతున్నారు.

లోకేష్ చేతులమీదుగా ఇంటి పట్టాలు పొందిన కుటుంబాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. “ఇప్పుడు మాకు భయం లేదు. పట్టాలు వచ్చాయి.. మన ఇళ్లు మనవి అయ్యాయి” అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. decades‌ ల‌ మ‌ధ్య భయంగా గడిపిన జీవితం ఇప్పుడు స్థిరత్వంతో నిండిపోయింది.