
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో స్థానిక వినాయకుడి గుడి ప్రాంగణo వద్ద సద్భావన కమ్యూనిటీ టీమ్ చోడవరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకలితో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని నూతన ఆలోచనతో ఈరోజు చోడవరం పట్టణంలో కమ్యూనిటీ ప్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా డొనేషన్ చేయవచ్చు మరియు వివిధ కార్యక్రమాలలో మిగిలి ఉన్న ఆహారాన్ని వృధాగా పోకుండా ప్యాకింగ్ చేసి కేవలం శాకాహారం మాత్రమే ఫ్రిజ్లో ఉదయం ఎనిమిది8:35 నుండి రాత్రి 9:30 గంటల వరకు తీసుకుంటారని తీసుకున్న ఆహారాన్ని పేద ప్రజలకు అందించడం జరుగుతుందని సద్భావన కమ్యూనిటీ టీం తెలియపరిచారు చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ ఎన్ రాజు దీనిని ప్రారంభించారు. ఆంధ్రప్రభ చోడవరం ఇంచార్జ్ నాయుడు గారు మొదట ఈ కార్యక్రమానికి డొనేషన్ అందించి ఆహారాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందించారు పలువురు ప్రముఖులు సద్భావన కమ్యూనిటీ టీం చోడవరం వారు కార్యక్రమంలో పాల్గొన్నారు.




