Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeFilms Newsజైలు అనుభవం గురించి జానీ మాస్టర్ భావోద్వేగం

జైలు అనుభవం గురించి జానీ మాస్టర్ భావోద్వేగం

-

Chat on WhatsApp

టాలీవుడ్ లో ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన జానీ మాస్టర్, ఇటీవల కొన్ని కారణాలతో జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఆయన గురించి సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో పెద్ద చర్చ జరిగింది. జైలు నుండి బెయిల్ పై విడుదలైన ఆయన, తాజాగా ‘జాఫర్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు.

“జైలుకి వెళ్లినప్పుడు నా జీవితంలో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. సాయంత్రం అయ్యాక నా కుటుంబం గుర్తుకొచ్చేది. మా అమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడం గురించి ఆందోళన చెందేదాన్ని. నా బాధను బయట చూపించకుండా వాష్ రూమ్ కి వెళ్లి ఏడ్చేవాడిని,” అంటూ భావోద్వేగంగా చెప్పారు.

జైలులో గడిపిన అనుభవాల గురించి మాట్లాడుతూ, “జీవితంలో ఎవరూ జైలు ముఖం చూడకూడదు. అది ఎంత పెద్ద శత్రువైనా సరే, నేను కోరుకునేది అదే. ఆ సమయంలో నా భార్య సుమలత నాకు పెద్ద మద్దతుగా నిలిచారు,” అని తెలిపారు.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పై వస్తున్న వార్తల గురించి ఆయన వివరిస్తూ, “వాళ్లకి నాపై నమ్మకం ఉంది కాబట్టే మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు మౌనమే గొప్పగా మాట్లాడుతుంది. నాగబాబు గారు, నా అభిమానులు నాకు మద్దతుగా నిలిచినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను,” అని జానీ మాస్టర్ అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

bhogapuram international airport nearing inauguration in andhra pradesh

భోగాపురం విమానాశ్రయం రెడీ.. ప్రధాని మోడీ చేతుల మీదుగా? కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్...
- Advertisement -
Chat on WhatsApp