Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్కు శుక్రవారం జోష్ తిరిగి వచ్చింది. గురువారం భారీ పతనంతో దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయిన నేపథ్యంలో, ఈరోజు మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 361 పాయింట్లు పెరిగి 82,859 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 25,581 వద్ద ట్రేడ్ అవుతోంది. అన్ని రంగాల సూచీలు ప్రస్తుతం గ్రీన్లోనే కదులుతున్నాయి.
నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే కోల్ ఇండియా(Coal India), ఒఎన్జీసీ, ఎల్ అండ్ టీ, ఐషర్ మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి.
గురువారం ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఉద్రిక్తతల ప్రభావంతో మార్కెట్ పడిపోయింది. అయితే అణు ఒప్పందంపై చర్చలకు గడువు ఇస్తూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం భారత మార్కెట్కు ఊరటనిచ్చింది.
READ MORE:నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి?..నా అన్వేషణ సంచలన కామెంట్స్








