Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshభార్యాభర్తల గొడవ... కొడవలితో భర్త హత్య...

భార్యాభర్తల గొడవ… కొడవలితో భర్త హత్య…

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని గుచ్చిమి గ్రామంలో గురువారం ఉదయం ఒక విషాద సంఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య మునుపటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆవేశానికి లోనైన భర్త వై. సత్యము తన భార్య గౌరమ్మపై కొడవలితో దాడి చేశాడు.

భర్త చేసిన దాడిలో గౌరమ్మకు తీవ్ర గాయాలు కాగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తులు సంఘటనను తెలుసుకున్న వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో శోక సందరాయంగా మారింది.

పెదమానపురం ఎస్సై జయంతి, గజపతినగరం సిఐ జిఏవి రమణ సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి హంతకుడిని పట్టుకోవడంలో సాయపడుతున్నారు. పోలీసులు హత్యకు సంబంధించిన కారణాలను తెలియజేసేందుకు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu | పట్టిసీమ లేకుంటే కృష్ణా డెల్టా పరిస్థితి దారుణం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: రాష్ట్రంలో సాగునీటి రంగాభివృద్ధికి కేఎల్ రావు చూపిన మార్గమే ఆదర్శమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా-గోదావరి(Krishna- Godavari) సంగమ క్షేత్రంలో ప్రత్యేక పూజలు...
- Advertisement -
Chat on WhatsApp