Helicopter Crash: ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్లోని మెలావి జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి నేలకూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
హెలికాప్టర్ ప్రమాదంపై అధికారుల విచారణ ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు కారణమా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో ఇండోనేషియా విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటనతో ఇండోనేషియాలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.








