Eluru Paddy Issue:ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలంలో ధాన్యం పండించే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు . ఖరీఫ్ సీజన్ 2025–26లో పండించిన సోనా, సంపత్ సోనా రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లు నిరాకరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలలో లోడ్ చేసిన బస్తాలు 48 గంటలుగా నిలిపివేసి ఉన్నప్పటికీ, మిల్లర్ల నుంచి అనుమతి లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ALSO READ:ఈ 19న కడపకు సీఎం చంద్రబాబు: CM Chandrababu Kadapa Visit
మిల్లర్ల నిరాకరణ వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, పంటను తక్షణం తరలించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని రైతుల వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ధాన్యం కొనుగోలు సమస్యపై ప్రభుత్వ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
