Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakబీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్

బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్

-

Chat on WhatsApp

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ కోరారు. రామాయంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రస్తుతం బీడీ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని, వారికి నెలకు 26 రోజుల పని దినాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం ప్రకటించిన 4000 రూపాయల పెన్షన్‌ను బీడీ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 6000 రూపాయల పెన్షన్ అందించాలన్నారు.

బీడీ కార్మికులు అణచివేతకు గురవుతున్నారని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని లక్ష్మణ్ తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి, వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన వేతనాలు, ఆరోగ్య పథకాలు, సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తక్షణమే కార్మికుల హక్కులను కాపాడకపోతే, సమ్మెలు, నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని లక్మణ్ గారు కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp