విడవలూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది
విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 20 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఘటన గ్రామస్తుల ఆందోళనకు కారణమైంది. ప్రభుత్వ భూములను టార్గెట్ చేస్తూ మాఫియా నిరభ్యంతరంగా దందా సాగిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నంబర్ ప్లేట్లు లేకుండా, లైసెన్స్ లేని డ్రైవర్లతో మట్టిని అధిక వేగంతో తరలిస్తున్న మాఫియా పోలీసులను సైతం లెక్కచేయడం…
