జిల్లా కలెక్టర్ పీఎం జుగా పథకంపై సమీక్షా సమావేశం
పార్వతీపురం, అక్టోబరు 3: ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా ) పధకాన్ని వినియోగించుకొని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా) కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కావలసిన ప్రతిపాదనలపై కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
