Ameerpet Fire Incident: అమీర్పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలోని కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ఉదయం సమయంలో పలువురు విద్యార్థులు కోచింగ్ క్లాస్లో ఉండగా, మంటల మధ్య చిక్కుకుపోయారు. అక్కడున్న వారిలో కొంతమంది భయంతో పరుగెత్తి బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ, కొందరు మంటల మధ్య చిక్కుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.కొంత మంది విద్యార్థులను హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో, భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
భవనంలోని ఇతర అద్దెదారులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం స్థానికులకు, విద్యార్థుల కుటుంబాలకు భయానక అనుభవంగా నిలిచింది. అగ్నిమాపక విభాగం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా భవనాల ఎలక్ట్రికల్ సేఫ్టీపై సిఫార్సులు అందిస్తోంది.
READ MORE:POLAVARAM | వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ మృ*త్యు ఘటన




