Afghanistan: పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఇరుదేశాల మధ్య విరోధాలు కొనసాగుతున్నాయి. అఫ్గాన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, పాక్లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించారు.
ముఖ్యంగా రావల్పిండికి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ను లక్ష్యంగా భారీ దాడులు చేశారు. అదనంగా, క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని కొన్ని ఇతర సైనిక కేంద్రాలను కూడా దాడి చేశారు.
తమ దేశంలోని పాకిస్థాన్ వైమానిక దాడుల ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అఫ్గాన్ అధికారులు స్పష్టం చేశారు. నూర్ ఖాన్ ఎయిర్బేస్ సహా పలు సైనిక కేంద్రాలు ఈ దాడుల్లో గణనీయంగా దెబ్బతిన్నాయి.
మరోవైపు తూర్పు అఫ్గాన్ నగరం జలాలాబాద్ సమీపంలో పాక్ యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. పైలట్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
ఇప్పటికే గత ఆపరేషన్లలో దెబ్బతిన్న నూర్ ఖాన్ ఎయిర్బేస్ మరమ్మతులు పూర్తికాకముందే తాజా దాడి జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెంచుతున్నాయి.
ALSO READ:Iran war tensions | విమానాల రద్దుతో దుబాయ్లో చిక్కుకున్న ప్రముఖులు








