పెద్దిపల్లి మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఈ నెల 12 న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేడు స్వామివారి రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆలయం జైనుల కాలం నాటిది. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి స్వామివారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు.జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కలిపించాం అని అధికారులు తెలిపారు అలాగే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు మరియు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటునాము అని ఆలయ ఈవో శంకరయ్య అన్నారు.
దేవునిపల్లి రథోత్సవానికి భక్తుల రద్దీ
RELATED ARTICLES







