Monday, March 23, 2026
Chat on WhatsApp
HomeHealth Newsవిటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు ఉత్తమ ఆహారాలు

విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు ఉత్తమ ఆహారాలు

-

Chat on WhatsApp

ప్రస్తుతం మన సమాజంలో పొల్యూషన్, ఇంటర్నెట్ వాడకం వంటి కారణాలతో విటమిన్ డి లోపం మరింత పెరిగిపోతుంది. శరీరంలో విటమిన్ డి సరిపడా లేకపోతే ఎముకల బలహీనం, ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యలు వస్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల శరీరంలోని హార్మోన్లు, ఎంజైమ్ ల తయారీ కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి, ఈ లోపాన్ని అధిగమించేందుకు పోషకాహారాన్ని అలవాటు చేసుకోవడం చాలా అవసరం.

ఆహారం లో విటమిన్ డి పొందడం కోసం పుట్టగొడుగులు (మష్రూమ్స్) చాలా మేలు చేస్తాయి. శాకాహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉండేది మష్రూమ్స్ లోనే. ప్రతి వంద గ్రాముల మష్రూమ్స్ లో 230 నుంచి 450 ఐయూ విటమిన్ డి ఉంటుంది. అలాగే, గుడ్లలోని పచ్చ సొన కూడా విటమిన్ డి ను అందిస్తుంది. గుడ్ల నుంచి విటమిన్ డి మంచి పరిమాణంలో లభిస్తుంది, ప్రత్యేకంగా ఉడికించి తినడం వల్ల.

ఫోర్టిఫైడ్ పాలు, పెరుగు కూడా విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు సహాయపడతాయి. ఈ పాలల్లో విటమిన్ డి కలిపి, చిన్నపిల్లలకు కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. రోహు, హిల్సా చేపలు కూడా విటమిన్ డి మంచి వనరులుగా ఉన్నాయి. ప్రతి 100 గ్రాముల చేపలో 250 ఐయూ వరకు విటమిన్ డి ఉంటాయి. చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అందిస్తాయి, ఇవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.

నెయ్యి కూడా విటమిన్ డి మంచి వనరుగా ఉంది. ప్రతి టేబుల్ స్పూన్ నెయ్యిలో 20 ఐయూ వరకు విటమిన్ డి ఉంటుంది. రోజూ ఒక లేదా రెండు చెంచాల నెయ్యి తినడం ద్వారా విటమిన్ డి లోపాన్ని పోగొట్టుకోవచ్చు. సాధారణంగా పెద్దవారికి 600 నుంచి 800 ఐయూ విటమిన్ డి అవసరం, కానీ పెరుగుతున్న పిల్లలకు మరింత ఎక్కువగా అవసరం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

పసిడిపై పశ్చిమాసియా యుద్ధ సెగ..

బిజినెస్ డెస్క్: ఈ ఏడాది ఆరంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా దిగొస్తూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి....
- Advertisement -
Chat on WhatsApp