Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaPeddapalliరామగుండం ఎమ్మెల్యే ను కలిసిన విద్యాశాఖ ప్రతినిధులు

రామగుండం ఎమ్మెల్యే ను కలిసిన విద్యాశాఖ ప్రతినిధులు

-

Chat on WhatsApp

రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎంఈఓ శ్రీ గడ్డం చంద్రయ్య, ముత్తారం ఎమ్ఈఓ ఇరుగురాల ఓదెలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గోదావరిఖని ప్రధానోపాధ్యాయులు జింక మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సమావేశంలో పాఠశాల సమస్యలు, అలాగే రామగుండం మండల విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలను పరిశీలించారు. విద్యాభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు మరియు విద్యా సమాజం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ విద్యాభివృద్ధిపై మరింత కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించేందుకు ప్రభుత్వంతో సమన్వయం అవసరమని ఆయన తెలిపారు.

అంతేకాక, పాఠశాలల్లో మరింత వసతుల కల్పన, బోధన పద్ధతుల్లో మార్పులు, అలాగే పాఠశాల స్థిరత్వానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp