Monday, April 13, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshనిత్యవసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలపై సిపిఎం పార్టీ ఆగ్రహం

నిత్యవసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలపై సిపిఎం పార్టీ ఆగ్రహం

-

Chat on WhatsApp

రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసర ధరలు, విద్యుత్ చార్జీలకు హద్దే లేదా అంటూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి. దొర మండిపడ్డారు, పెరుగుతున్న నిత్యవసర వస్తువులుధరలు అదుపు చేయాలన్నారు. ఒక కేజీ ఆయిల్ ధర 130 గా ఉంది. ఒక కేజీ కందిపప్పు 110. టమాటో ధర కేజీ 50 రూపాయలు గా ఉంది. పెట్రోల్ ఒక లీటర్ ధర 120 గా ఉంది. ఒక నెల సెల్ ఫోన్ రీఛార్జ్ ధర 300 గా ఉంది. ఈ రకంగా ఉంటే సామాన్య ప్రజలు ఏ రకంగా బ్రతకగలరని అన్నారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై కరెంటు చార్జీలు పెంచరాదన్నారు.

మహిళలు, పిల్లలు పై దళితులపైదాడులు, అత్యాచారాలు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అన్నారు. పరిశ్రమలలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలి, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి. గత ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు బాదుడే బాదుడు కార్యక్రమాలు పెడుతూ ఇప్పుడు అధికారంలోకి రాబోయే సరికి ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోయారు అంటూ ప్రశ్నించారు. విశాఖపట్నంలో బిగించేటటువంటి స్మార్ట్ మేటర్లు బిగింపు ఆపాలన్నారు. లేదంటే తగిన గుణపాఠం ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు.ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు. శంకరావు. ఈశ్వరావు. సుధాకర్. దుప్పి దాసు. ఈరట ఈశ్వరావు. సోముల. రమణబాబు. దుప్పి. నారాయణ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp