Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeCrime Newsభైంసా మార్కెట్‌లో రైతులకు కాంటాల మోసం

భైంసా మార్కెట్‌లో రైతులకు కాంటాల మోసం

-

Chat on WhatsApp

భైంసా వ్యవసాయ మార్కెట్‌లో సొయా ధర ఎక్కువగా రావడంతో రైతులను మోసం చేస్తున్నారు. వీరికి “తరుగు” పేరిట కుచ్చు టోపీ పెడుతున్నారు.క్వింటాలుకు 2 కిలోల కోత విధిస్తూ, రైతులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారు. వారి సరుకు విలువను తగ్గిస్తూ వారి మట్టిలోపెడుతున్నారు. ఈ కోతలకు వ్యాపారస్తులు సొంత కోడ్‌లు పెట్టుకుని వ్యవహరిస్తున్నారు. ఇది రైతులపై మరింతగా మోసం చేసే మార్గముగా మారింది. కొనుగోలుదారులు, కమిషన్ ఎజెంట్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారు.
అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం పర్యవేక్షణ లేని వ్యవస్థగా మారింది. మార్కెట్‌లో అధికారుల ప్రమేయం లేకుండా ఈ మోసాలు జరగడంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఇది వ్యాపారస్తులకు నిధుల వసూలుగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారస్తులు ఇష్టారీతిన కోతలు విధిస్తున్నారు.
రైతుల హక్కులను పరిరక్షించకుండా వారి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇలాంటి అన్యాయంపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు న్యాయం జరుగుతుందా లేదా అనే ప్రశ్న వారిని వెంటాడుతోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp