వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని అభిలాషించారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించి, ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ విజయ దశమి అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రైతులు, యువత, వ్యాపారులు, మహిళలు ఇతర అన్నివర్గాల వారు బాగుండాలని ఎంపీ డా.కడియం కావ్య అమ్మవారిని ప్రార్ధించారు.








