Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపారాది వంతెన పనులు పునఃప్రారంభం

పారాది వంతెన పనులు పునఃప్రారంభం

-

Chat on WhatsApp

బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు.

గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి వివరించి, త్వరితగతిన నిధులు మంజూరు అయ్యేలా సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన మాట్లాడుతూ,ఈ వంతెన పునఃనిర్మాణ పనులు తన హయాములో జరగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు..అలాగే, వంతెన నిర్మాణం వచ్చే ఏడాది వర్షాకాలంలోపు పూర్తిచేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే బేబీనాయన అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, రొంపిల్లి గ్రామ సర్పంచ్ బవిరెడ్డి శంకర్రావు గారు, పారాది గ్రామ పెద్దలు, ప్రజలు మరియు ఆర్ & బి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp