ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి( Actor Tanikella Bharani) ప్రధాని నరేంద్ర మోడీతో తనకున్న అనుభూతిని పంచుకుంటూ చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోడీని కలవడం తన జీవితంలో అత్యంత గొప్ప క్షణమని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం తన జన్మను ధన్యంగా మార్చిందని భావోద్వేగంగా వెల్లడించారు.
తనికెళ్ల భరణి తన పోస్టులో మాట్లాడుతూ, “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. వాళ్లను చూడలేము కూడా. కానీ ఆ మహనీయుల లక్షణాలు, అంశాలు అన్నీ కలిసిన వ్యక్తిగా మోడీని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దాడాను. ఇది నా జీవితంలో గొప్ప క్షణం, నా జన్మ ధన్యమైంది” అని పేర్కొన్నారు.
మోడీని కలవడం కేవలం ఒక సాధారణ సమావేశం కాదని, అది తనకు ఆధ్యాత్మిక అనుభూతిలా అనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటన తన జీవితానికి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చిందని కూడా వెల్లడించారు.
ప్రస్తుతం తనికెళ్ల భరణి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ అవుతోంది.








