Former Vice President Venkaiah Naidu: ఉచిత పథకాల అమలుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం ప్రభుత్వాలు ఉచితాల పేరుతో పథకాలు (free schemes)ప్రకటిస్తే, సాయంత్రానికి మద్యం రూపంలో ప్రజల జేబుల్లోంచి కాళీఅవుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
ALSO READ:Kukatpally Demolition | హైదరాబాద్లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్
ఇది సాధారణ విషయం కాదని, ప్రజల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యవస్థగా అభివర్ణించారు. పేదలకు విద్యా, వైద్య రంగాల్లో మాత్రమే ఉచిత సేవలు అందించడం సరైన దారినడక అని, మిగతా అన్ని రంగాల్లో ఉచితాలపై ఆధారపడే విధానాన్ని ప్రభుత్వాలు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై లోతుగా ఆలోచించాలని సూచించారు.
