నేడు తెలంగాణలో ముఖ్యమైన పరిణామానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల సిద్ధతపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ కీలక చర్చలు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగా రిజర్వేషన్ వ్యవస్థను స్పష్టంగా తేల్చాల్సి ఉండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది.
also read:Saudi Bus Accident: సౌదీలో 42 మంది భారత యాత్రికులు మృతి
అలాగే రైతు భరోసా పథకం నిధుల విడుదలపై కూడా చర్చించనున్నారు. పథకాన్ని సమయానికి అమలు చేసి రైతులకు ఆర్థిక సహాయం అందించే విధానాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదనంగా, గిగ్ వర్కర్స్ సంక్షేమ బిల్లుపై మంత్రివర్గం మళ్లీ సమీక్ష జరపనుంది. వ్యాపార, సేవా రంగాల్లో పని చేసే గిగ్ ఉద్యోగులకు రక్షణ కల్పించే నిబంధనలను కేబినెట్ పరిశీలించనుంది.
