Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaNalgondaకుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మహత్య

-

Chat on WhatsApp

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో మానసిక వేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం, డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన జెట్టమోని నరసింహ (55) హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు.

కొన్ని సంవత్సరాల క్రితం ఆయన భార్య గెల్వలమ్మ కరోనా సమయంలో మృతి చెందింది. అప్పటి నుంచి నరసింహ ఒంటరిగా జీవిస్తున్నాడు.

ALSO READ:నరసరావుపేట డీఎస్పీపై మాజీ మంత్రి విడదల రజినీ సంచలన ఆరోపణలు – “వదిలే ప్రసక్తే లేదు” హెచ్చరిక

ఇటీవల ఆయన కొడుకు అంజనేయులు, కోడలు మాధవితో తరచుగా కుటుంబ కలహాలు జరుగుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి, డ్యూటీకి వెళ్లకుండా కొండమల్లేపల్లికి చేరుకున్నాడు. అక్కడ పశువుల సంత సమీపంలో అర్థరాత్రి ఓ రేకుల పందిరిలో నైలాన్‌ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp