Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeNationalఝార్ఖండ్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ

ఝార్ఖండ్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ

-

Chat on WhatsApp

ఝార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ముఖ్యంగా సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్, ఝార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా లుగు పర్వత ప్రాంతంలోని లాల్‌పానియా వద్ద కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ కాల్పుల్లో మృతిచెందిన వారిలో ప్రధానమైంది ₹1 కోటి రివార్డు ఉన్న మావోయిస్టు నేత ప్రయాగ్ మాంఝీ, అతని మరొక పేరుగా వివేక్, ఫుచన్, నాగ మాంఝీ, కరన్, లెతర కూడా పేర్లతో పిలవబడుతాడు. అతడు గతంలో ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో అనేక హింసాత్మక ఘటనల్లో పాత్ర పోషించాడని తెలుస్తోంది. గిరిధి జిల్లాలో అతనిపై 50కి పైగా కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్రయాగ్ మాంఝీ స్వస్థలం ధన్‌బాద్ జిల్లాలోని దల్‌బుద గ్రామం. అతడు ప్రశాంత్ హిల్స్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించేవాడని సమాచారం. ప్రయాగ్ మాంఝీను ఝార్ఖండ్‌లో అత్యధిక రివార్డు ఉన్న రెండో మావోయిస్టు నేతగా గుర్తించారు.

ప్రయాగ్ మాంఝీ భార్య జయ మాంఝీని గతేడాది క్యాన్సర్ చికిత్స కోసం వచ్చినప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె చికిత్స పొందుతూ మరణించింది. తాజా ఎన్‌కౌంటర్‌తో, భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేతను మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp