Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeOthersరోహిత్ శ‌ర్మ రికార్డ్ దూకుడు… చెన్నైపై ఎంఐ భారీ విజయం

రోహిత్ శ‌ర్మ రికార్డ్ దూకుడు… చెన్నైపై ఎంఐ భారీ విజయం

-

Chat on WhatsApp

ఈసారి ఐపీఎల్ 18వ సీజన్ అభిమానులకు మరింత ఉత్కంఠతో ఉన్నది. పెద్ద అంచనాలతో ఆడుతున్న జట్లు అంచనాలను అందుకోలేకపోతున్నపుడు, నో ప్రీడిక్షన్స్ తో వచ్చే జట్లు విజయాలను అందుకుంటున్నాయి. ఆదివారం ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరియు ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య ఆసక్తికరమైన పోరు జరిగింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టమైనవయ్యాయి. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజ‌యాలతో, చెన్నై అట్ట‌డుగున ఉండగా, ముంబై ఈ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరిచింది.

ఈ మ్యాచ్‌లో అజేయంగా 76 పరుగులు చేసిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. ఇది అతని ఐపీఎల్‌లో 20వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డైంది. ఈ జాబితాలో రోహిత్ శర్మ 20 అవార్డులతో భారత ఆటగాడిగా అత్యధిక పీఓటీఎంలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇక, ఈ విజయంలో శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ, 6,786 పరుగులతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలోకి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో 8,326 పరుగులతో కొనసాగుతున్నాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

LPG cylinders were swept away after floodwaters entered an HPCL bottling plant in Maharashtra

LPG cylinders | మహారాష్ట్రలో భారీ వర్షాల బీభత్సం.. వరదలో కొట్టుకెళ్లిన LPG సిలిండర్లు

LPG cylinders: మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో రాయగడ్ జిల్లాలోని పారిశ్రామిక...
- Advertisement -
Chat on WhatsApp