Monday, July 13, 2026
Chat on WhatsApp
HomeFilms Newsవర్మకు హైకోర్టులో ఊరట, సీఐడీపై ఆంక్షలు

వర్మకు హైకోర్టులో ఊరట, సీఐడీపై ఆంక్షలు

-

Chat on WhatsApp

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఐడీ పోలీసులు వర్మకు నోటీసులు పంపారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో పాటు అభ్యంతరకర పోస్టులు షేర్ చేసినట్లు కేసు నమోదైంది.

ఈ నేపథ్యంలో, సీఐడీ ఇచ్చిన నోటీసులను రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో సవాల్ చేశారు. తనపై తీసుకుంటున్న చర్యలు స్వేచ్ఛా వ్యక్తీకరణ హక్కును అణచివేయడమేనని వాదించారు. విచారణ సందర్భంగా హైకోర్టు వర్మ పిటిషన్‌ను పరిశీలించి, ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించింది.

వర్మపై సీఐడీ అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకూ ఆయనను అరెస్ట్ చేయరాదని తెలిపింది. వర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవా కాదా అనే అంశాన్ని విచారణలో స్పష్టత ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది.

ఇప్పటికే ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమవుతోంది. వర్మ తరపున పలువురు వ్యక్తులు మద్దతు తెలుపగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఊరటతో వర్మపై ఐదు రోజులుగా నెలకొన్న అరెస్ట్ భయం కొంతవరకూ తీరినట్లైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

akhil akkineni thanks chiranjeevi for praising lenin movie success

Chiranjeevi | లెనిన్’ సక్సెస్‌పై చిరంజీవి ప్రశంసలు.. అఖిల్ ఎమోషనల్ రిప్లై

Chiranjeevi: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి స్పందనను సొంతం చేసుకోవడంతో సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ఈ...
- Advertisement -
Chat on WhatsApp