Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏపీఎస్ ఆర్టీసీ అధికారుల పదోన్నతులకు బ్రేక్!

ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల పదోన్నతులకు బ్రేక్!

-

Chat on WhatsApp

ఏపీఎస్ ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ అధికారులకు నిరాశ ఎదురైంది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) అనుమతించకపోవడంతో దాదాపు 110 మంది అధికారుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. అధికారి రికార్డుల సమగ్రత లోపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

డిపో మేనేజర్, డివిజనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) స్థాయిలోని పలువురు అధికారులు గత ఆరు నెలలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. డీపీసీ సమావేశం జరిగినా, అధికారుల వార్షిక రహస్య నివేదికలు (ACRs) ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌లో లేకపోవడంతో, కమిటీ ఎంపిక ప్రక్రియను నిలిపివేసింది.

ప్రస్తుతం ఉన్న నివేదికలను పరిగణనలోకి తీసుకుని పదోన్నతులను అందించాలని అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ, డీపీసీ అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ విధానం ప్రకారం, నివేదికలు కొత్త ఫార్మాట్‌లో సిద్ధం చేసి సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ కారణంగా అనేక జిల్లాల్లో డిపోలకు ఇన్‌చార్జి అధికారులతోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పదోన్నతుల జాప్యం అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతుందని సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

central government increases onion procurement price for farmers buffer stock scheme

Central government | ఉల్లి రైతులకు  భారీ ఊరట.. కొనుగోలు ధర 13% పెంపు

Central government: దేశవ్యాప్తంగా ఉల్లి సాగు చేస్తున్న రైతులు మార్కెట్‌లో ధరల పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఉల్లి ధరల అస్థిరతను నియంత్రించడంతో పాటు రైతులకు...
- Advertisement -
Chat on WhatsApp