Saturday, July 25, 2026
Chat on WhatsApp
HomeKumaram Bheem AsifabadAsifabadపట్టభద్రుల సమావేశానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ విఠల్

పట్టభద్రుల సమావేశానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ విఠల్

-

Chat on WhatsApp

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం బెజ్జూరు పెంచికల్ పేట్ మండలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటించారు. ఈ నెల 20వ తేదీన కాగలజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్‌లో పట్టభద్రుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టభద్రులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

అన్ని పట్టభద్రులు సమావేశానికి హాజరయ్యేలా చూడాలని సూచించిన ఎమ్మెల్సీ విఠల్, అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టభద్రుల భవిష్యత్‌కు ఈ సమావేశం కీలకమని తెలిపారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి.

పెంచికల్ పేట్ మండలం కొండేపల్లి గ్రామంలో రైతులతో సమావేశమైన ఎమ్మెల్సీ దండే విఠల్, కోడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి తగిన పరిష్కారం కోసం అధికారులతో చర్చిస్తానని తెలిపారు.

పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, అటవీశాఖ మంత్రితో చర్చలు జరిపి, రెవెన్యూ మరియు అటవీ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సహాయంతో పోడు భూముల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపాలని తమ ప్రయత్నం ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp