Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeCrime Newsఒడిశా సరిహద్దులో మావోయిస్టు నేత చంద్రహాస్ మృతి

ఒడిశా సరిహద్దులో మావోయిస్టు నేత చంద్రహాస్ మృతి

-

Chat on WhatsApp

ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ప్రాంతంలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు. తెలంగాణకు చెందిన సీనియర్ మావోయిస్టు నాయకుడు అల్వాల్ ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఎదురుకాల్పుల్లో మరణించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆయన ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

మృతి చెందిన చంద్రహాస్‌పై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ జవహర్ నగర్‌కు చెందిన ఆయన 1985 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. భద్రతా బలగాలు ఎప్పటి నుంచో చంద్రహాస్ కదలికలపై నిఘా ఉంచి చివరకు ఈ ఎన్‌కౌంటర్‌లో ఆయనను నిలువరించాయి.

ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మరో కీలక ఆపరేషన్‌ నిర్వహించాయి. కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ సంయుక్తంగా మెటగూడెం, దులేర్ గ్రామాల మధ్య భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు ఉపయోగించే బాంబులు, ఆయుధ తయారీ సామాగ్రిని అధికారులు గుర్తించారు.

భద్రతా బలగాలకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ దాడి జరిగింది. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఐఈడీలు, మల్టిపుల్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌తో మావోయిస్టుల తాకిడి తగ్గించే దిశగా భద్రతా బలగాలు కీలక అడుగు వేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ntr office issues clarification on raw ntr and political entry rumours

‘RAW NTR’ ఎవరి సంస్థ? ఎన్టీఆర్ టీమ్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం

ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న ప్రచారాలకు ఆయన కార్యాలయం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ‘RAW NTR’ అనే సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు విడుదల...
- Advertisement -
Chat on WhatsApp