Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeHealth Newsనడక వేగం పెంచడం వల్ల డయాబెటిస్, గుండె వ్యాధులకు దూరం

నడక వేగం పెంచడం వల్ల డయాబెటిస్, గుండె వ్యాధులకు దూరం

-

Chat on WhatsApp

ప్రతి రోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, తాజా అధ్యయనంలో నడక వేగాన్ని పెంచడం ద్వారా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని జపాన్‌లోని దోషిషా యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేశారు.

స్థూలకాయంతో బాధపడుతున్న 25 వేల మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ పరిశోధన వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నడక వేగం పెరిగిన వ్యక్తుల్లో డయాబెటిస్ ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్లు అధ్యయనకారులు గుర్తించారు.

అలాగే, వేగంగా నడిచే వారిలో హైపర్ టెన్షన్ మరియు రక్తంలో అసాధారణ లైపోప్రొటీన్ లెవల్స్ (డిస్లీపిడీమియా) ముప్పు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. పరిశోధకులు, నడక వేగం మరియు సమగ్ర ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపారు.

ఇలా వేగంగా నడిచే వారిలో గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. ఈ మెరుగుదల వల్ల జీవక్రియకు సంబంధించిన వ్యాధుల ముప్పు దూరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

bhogapuram international airport nearing inauguration in andhra pradesh

భోగాపురం విమానాశ్రయం రెడీ.. ప్రధాని మోడీ చేతుల మీదుగా? కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్...
- Advertisement -
Chat on WhatsApp