Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeAndhra Pradeshమళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానం - భార్య, కూతురు హత్య

మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానం – భార్య, కూతురు హత్య

కర్నూలు జిల్లా హోళగుంద మండలం హెబ్బటం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. సకరప్ప అనే వ్యక్తి మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య సలీమాను, మూడేళ్ల కూతురు సమీరాను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

సకరప్ప, సలీమా (21) దంపతులకు మూడేళ్ల కుమార్తె సమీరా ఉంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న సలీమాకు మళ్లీ ఆడపిల్లే పుడుతుందేమోనని సకరప్ప అనుమానంతో ఆమెను నిత్యం వేధించేవాడు. గురువారం రాత్రి వీరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆవేశానికి లోనైన సకరప్ప, కర్రతో సలీమాను కొట్టి చంపాడు. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా మారిన మూడేళ్ల సమీరాను కూడా గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘోర ఘటన స్థానికులను, సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది.

ఈ అమానుష చర్య అనంతరం సకరప్ప పోలీసుల వద్ద లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మీద జిల్లా ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular