మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను జీవన విధిగా మార్చుకోవాలని రోద్దం మండల ఎంపీడీవో పిలుపునిచ్చారు.
గ్రామ సచివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి, బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు.
స్కూల్ పిల్లలచే ప్రతిజ్ఞ చేయించి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వీధులలో చెత్తా చెదారం లేని గ్రామాలుగా చూడాలని పిలుపునిచ్చారు.
గ్రామ సచివాలయం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, స్వచ్ఛభారత్ కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రోద్దం మండల ఎంపీడీవో రాబర్ట్ విల్సన్, సర్పంచ్, రూప పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
A N M, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ కార్మికులకు మెడికల్ చెకప్ నిర్వహించి, వారి ఆరోగ్యాన్ని నిర్ధారించారు.