ఖమ్మం వరద బాధితులకు మైనంపల్లి సహాయం

మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసి, రాజకీయాలు కాకుండా సహాయం చేయాలని సూచించారు. ఖమ్మం వరద బాధితులకు నిత్యావసరాలు: మైనంపల్లి సహాయక కార్యక్రమం

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్, నాయుడి పేటలోని వరద బాధితులకు మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిత్యావసర వస్తువులని పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం ద్వారానే అనేక మంది పేదలు ఈనాడు వరద బాధితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి పేదల బాధలను చూసి చేతనైనా సాయం చేయాలని హితవు పలికారు. అంతే తప్ప వరదలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథబాబు పాల్గొని వరద బాధితులకు నిత్యావసర వస్తువులని పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *