Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadకుషాయిగూడలో మహా ఘనపతికి కేటీఆర్ ప్రత్యేక పూజ

కుషాయిగూడలో మహా ఘనపతికి కేటీఆర్ ప్రత్యేక పూజ

-

Chat on WhatsApp

హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ టీఎస్ఐఐసీ కాలనీలో బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, యువసేన ఆధ్వర్యంలో మహా ఘనపతి ఏర్పాటు చేశారు.

ఈ ప్రత్యేక పూజకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరయ్యారు.

కేటీఆర్ మహా ఘనపతికి ప్రత్యేక పూజలు చేశారు, ఈ సందర్భంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

వినాయక చవితి సందర్భంగా 26 సంవత్సరాలుగా మహా ఘనపతి పూజ నిర్వహించడం, కేటీఆర్ రావడం ఎంతో సంతోషంగా ఉందని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, యువసేన సభ్యులు తెలిపారు.

కేటీఆర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించిన ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై గర్వంగా ఉన్నానని, కొన్ని రోజులు వెలుగు, కొన్ని రోజులు చీకటి ఉంటాయని, రానున్న రోజుల్లో ప్రభుత్వం మాదేనని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ వేడుకకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజల సందడితో మహా ఘనపతి పూజ ఘనంగా నిర్వహించబడింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp