Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅయినాపురంలో అక్రమ మట్టిపోతపై గ్రామస్తుల నిరసన

అయినాపురంలో అక్రమ మట్టిపోతపై గ్రామస్తుల నిరసన

-

Chat on WhatsApp

ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో గత 15 రోజులుగా ట్రాక్టర్ల ద్వారా భారీగా మట్టిని తరలించడం గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది. సర్పంచ్ మోకా రామారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై టెంట్ వేసి నిరసన తెలిపారు. సుమారు 40 ట్రాక్టర్లు రోజూ మట్టిని తరలిస్తుండడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు.

తనేలు సమీపంలో అక్రమంగా రొయ్యల చెరువును తవ్వి, అక్కడి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో రోడ్లపై బురద కట్టడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి హానీ కలుగుతోందని, దీనిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత శాఖలు ఈ సమస్యపై వెంటనే స్పందించాలని గ్రామస్థులు కోరారు. చెరువు తవ్వకాలను ఆపకుంటే, మట్టి తరలింపును కొనసాగిస్తే, పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే రైతులు, స్థానికులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తక్షణమే అధికారులు రంగప్రవేశం చేసి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. లేకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని, సమీప రహదారులను సైతం దిగ్బంధించేందుకు వెనుకాడబోమని గ్రామస్థులు స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp