Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeOthersవన్డేల్లో వరుసగా 11 టాస్ ఓడిన భారత జట్టు

వన్డేల్లో వరుసగా 11 టాస్ ఓడిన భారత జట్టు

-

Chat on WhatsApp

భారత క్రికెట్ జట్టు వన్డేల్లో వరుసగా 11 టాస్‌లను కోల్పోయి నెదర్లాండ్స్ పేరిట ఉన్న అతి ఎక్కువ టాస్ ఓటముల రికార్డును సమం చేసింది. 2023 నవంబర్ 19న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి ఇప్పటివరకు టీమిండియా ఒక్క టాస్‌ను కూడా గెలవలేదు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవడంతో ఈ రికార్డును నమోదు చేసింది.

2011 నుంచి 2013 మధ్య నెదర్లాండ్స్ వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడి అగ్రస్థానంలో నిలిచింది. అదే రీతిలో 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల్లోనూ, 2024 ఆగస్టులో శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లోనూ భారత జట్టు టాస్ గెలవలేకపోయింది. ఇలా వరుసగా 11 మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిపోయి ఈ రికార్డును సమం చేసింది.

ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల్లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. వరుసగా ఓటములు కొనసాగుతుండడంతో, టీమిండియా టాస్ విషయంలో అదృష్టం కలిసిరాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది ఇప్పటివరకు సమమైన రికార్డు మాత్రమే. కానీ భారత జట్టు మరో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోతే, నెదర్లాండ్స్‌ను అధిగమించి అత్యధిక టాస్ ఓటముల చెత్త రికార్డును సృష్టించిన జట్టుగా నిలిచే అవకాశం ఉంది. టాస్ ఓటములు మ్యాచ్‌ల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp