Saturday, February 21, 2026
spot_img
HomeInterNationalదక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం... 179 మంది మృతి...

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం… 179 మంది మృతి…

దక్షిణకొరియా మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ‘జెజు ఎయిర్’ కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 181 మంది ప్రయాణస్తులు, సిబ్బంది ఉన్నారు, అందులో 179 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే జాగ్రత్తగా ప్రాణాలతో బయటపడ్డారు.

వీరిద్దరు విమాన సిబ్బందే కావడం ఒక విశేషం. విమానం వెనుక భాగంలో కూర్చున్న వారు ఈ ప్రమాదంలో ఎలా బతకగలిగారు అన్నది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. విమాన ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, వెనుక సీట్లలో మరణాల రేటు మిగతా సీట్ల కంటే తక్కువగా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. 2015లో ‘టైమ్ మ్యాగజైన్’ నిర్వహించిన అధ్యయనంలో, వెనుక సీట్లలో మరణాల రేటు 32 శాతం మాత్రమే అని వెల్లడైంది.

దక్షిణ కొరియాలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు ప్రయాణికులు లీ (32) మరియు క్వాన్ (25) వారు విమానములో వెనుక భాగంలో కూర్చున్నారు. రేస్క్యూ సిబ్బంది మంటల్లో కతరించడం ప్రారంభించిన విమానాన్ని వెనుక భాగం నుండి వీరిద్దరిని బయటకు తీశారు. పరిస్థితిని వివరించిన వైద్యులు, లీ ఎడమ భుజం విరిగిపోయింది మరియు తలపై గాయాలైనట్లు చెప్పారు. క్వాన్‌కి చీలమండ విరిగిపోయినట్లు, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular