Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeBusinessStock Market | యుద్ధం మధ్య మార్కెట్ ట్రేడింగ్...దూసుకుపోతున్న సూచీలు

Stock Market | యుద్ధం మధ్య మార్కెట్ ట్రేడింగ్…దూసుకుపోతున్న సూచీలు

-

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలతో రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ, సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఉదయం 9.36 గంటల సమయంలో సెన్సెక్స్ 895 పాయింట్ల లాభంతో 75,123 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ సూచీ 292 పాయింట్ల పెరుగుదలతో 23,294 వద్ద ఉంది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి, అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరియు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టంలో ఉన్నాయి

అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినప్పటికీ, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు లాభాలు నమోదు చేస్తున్నాయి.

రూపాయి కూడా ఈ సమయంలో పతనమైంది. ఉదయం ఒక దశలో రూ.93.08 వద్దకు చేరి, 19 పైసలు విలువ కోల్పోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నగదు వెనక్కి తీసుకోవడంతో రూపాయి పతనం కొనసాగుతోంది.

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. నిన్న కూడా రూపాయి 49 పైసల నష్టంతో రూ.92.89 వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే

- Advertisement -
- Advertisment -

Must Read

telangana deputy chief minister bhatti vikramarka presenting state budget in assembly

Telangana Budget 2026 | ఏ శాఖకు ఎంత కేటాయింపు?…కీలక ప్రకటనలు ఇవే

Telangana Budget 2026: తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల భారీ వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని...