Tuesday, March 17, 2026
No menu items!
Home Films News రంభ వెండితెర రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రంభ వెండితెర రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

0
15
Starring Vicky Kaushal and Rashmika Mandanna, 'Chhaava' is achieving remarkable collections at the Telugu box office.
Starring Vicky Kaushal and Rashmika Mandanna, 'Chhaava' is achieving remarkable collections at the Telugu box office.

తెలుగు సినిమా ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన రంభ మరోసారి వెండితెరపై కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 1992లో ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో తెరంగేట్రం చేసిన రంభ, దక్షిణాదిలో అగ్రహీరోలందరితో నటించి క్రేజ్ తెచ్చుకుంది. 2008లో సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె, 2010లో కెనడా బిజినెస్‌మ్యాన్ ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని కుటుంబ జీవితంలో మునిగిపోయింది.

ఇటీవల రంభ తిరిగి సినిమాల్లోకి వస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను క్లారిటీ ఇచ్చారు. రంభ భర్త తనను కలసి, ఆమెకు ఓ అవకాశం ఇచ్చేలా చూడాలని కోరారని వెల్లడించారు. రంభ ప్రస్తుతం ఆర్థికంగా స్థిరంగా ఉందని, భర్త కూడా బడా బిజినెస్‌మేన్ అని వివరించారు. అయితే, మంచి ప్రాజెక్ట్ వస్తే తప్పకుండా అవకాశం కల్పిస్తానని ఆయన తెలిపారు.

రంభ తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, భోజ్‌పురి, ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించింది. కెరీర్ చివర్లో ఐటమ్ సాంగ్స్‌లో మెరిసిన రంభ, సినిమాలకు గ్యాప్ ఇచ్చినా టీవీ షోల ద్వారా బుల్లితెరపై కనిపించింది. ప్రస్తుతం ఆమె తమిళ ‘స్టార్ విజయ్’ చానల్‌లో ప్రసారమవుతున్న ‘జోడీ ఆర్ యూ రెడీ – సీజన్ 2’కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.

రంభ వెండితెర రీఎంట్రీపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఆమె నిజంగానే సినిమాలో నటిస్తుందా? లేక కేవలం ఊహాగానాలా? అన్నది ఇంకా స్పష్టత లేదు. కలైపులి థాను చేసిన వ్యాఖ్యలతో రంభ రీఎంట్రీపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఆమె మరోసారి వెండితెరపై మెరిసేందుకు మంచి అవకాశం రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.