Monday, April 13, 2026
Chat on WhatsApp
HomeNationalపరువునష్టం కేసులో పళనిస్వామికి 1.1 కోట్లు పరిహారం

పరువునష్టం కేసులో పళనిస్వామికి 1.1 కోట్లు పరిహారం

-

Chat on WhatsApp

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తనపై చేసిన నిరాధార ఆరోపణలపై కోర్టులో పరువునష్టం దావా వేయగా, తాజాగా ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2017లో కొడనాడు ఎస్టేట్ కేసులో ప్రధాన నిందితుడి సోదరుడు ధనపాల్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠను దెబ్బతీశాయని పళనిస్వామి పేర్కొన్నారు. ధనపాల్ తనపై నిందలు వేశారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.

కేసు విచారణలో జస్టిస్ ఆర్ఎంటీ టీకా రామన్ తీర్పు ఇస్తూ, ధనపాల్ పళనిస్వామిని కించపరిచే భాషను ఉపయోగించారని, ఇందువల్ల ఆయన ప్రతిష్ఠ దిగజారిందని పేర్కొన్నారు. ధనపాల్ చేసిన ఆరోపణలు నిరాధారమని, అవి పళనిస్వామిని కించపరిచే ఉద్దేశంతోనే చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణల కారణంగా పళనిస్వామి పరువుకు నష్టం వాటిల్లిందని తేల్చిన న్యాయస్థానం, ధనపాల్ రూ. 1.1 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp