T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని అంచనా ప్రకారం, టీమిండియా సూపర్ 8 రౌండ్ నుంచి సెమీఫైనల్కు అర్హత సాధించకపోవచ్చని పేర్కొన్నాడు.
భారత జట్టు ఫేవరెట్గా ఉన్నప్పటికీ, గ్రూప్ 1 “గ్రూప్ ఆఫ్ డెత్”గా ఉండటంతో ఈ అంచనాను అమీర్ సమర్థించాడు. గ్రూప్ 1లో భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ విజయాలతో నడుస్తున్న నేపథ్యంలో భారత్కు ఈ గ్రూప్ కఠినంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
అమీర్ చెప్పినట్లుగా, భారత బ్యాటింగ్ లైన్ప్ పాకిస్తాన్తో మ్యాచ్ మినహా విఫలమైందని, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో పోటీలో భారత్ వెనుకబడే అవకాశముంది. సూపర్ 8లో భారత్ ఆహ్మదాబాద్లో ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో మ్యాచ్లు ఆడుతుంది.
ఈ మూడు మ్యాచ్లలో కనీసం రెండు గెలవాలి, లేనిపక్షంలో సెమీఫైనల్కు అవకాశం తక్కువగా ఉంది.
అమీర్ అంచనాల ప్రకారం, గ్రూప్ 1లోని నాలుగు జట్లు ఇప్పటికే అపజయం లేని స్థితిలో ఉన్న కారణంగా, టీమ్ ఇండియాకు సెమీఫైనల్కు చేరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ అంచనాలను గమనిస్తూ, సూపర్ 8 రౌండ్లో భారత్ తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందో లేదో చూడాలన్న ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.
ALSO READ:భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ ?…హెచ్చరిస్తున్న నిఘా వర్గాలు








