Sunday, March 29, 2026
Chat on WhatsApp
HomeFilms NewsOne Piece Season 2 Trailer | సముద్రపు దొంగల సాహసం మళ్లీ మొదలైంది...?

One Piece Season 2 Trailer | సముద్రపు దొంగల సాహసం మళ్లీ మొదలైంది…?

-

Chat on WhatsApp

One Piece Season 2 : ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లైవ్-యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ “వన్ పీస్’ (One Piece)” రెండో సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “One Piece Season 2” ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మొదటి సీజన్ సాధించిన భారీ విజయం తర్వాత వస్తున్న ఈ సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ తాజా ట్రైలర్‌లో “మంకీ డి. లూఫీ” మరియు అతని “స్ట్రా హాట్ పైరేట్స్ గ్యాంగ్” అత్యంత ప్రమాదకరమైన “‘గ్రాండ్ లైన్’” సముద్ర మార్గంలోకి అడుగుపెడతారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన నిధి అయిన “వన్ పీస్” కోసం వారు మరింత సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

ఈ ప్రయాణంలో వింతైన దీవులు, భయంకరమైన శత్రువులు, ఊహించని మలుపులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయనున్నాయి.

మొదటి సీజన్‌తో పోలిస్తే ఈసారి యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, సస్పెన్స్ మరింత రెట్టింపు అయినట్లు ట్రైలర్ స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న “టోనీ టోనీ చాపర్” పాత్ర లైవ్-యాక్షన్‌లో తొలిసారి ఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జపాన్‌కు చెందిన ప్రముఖ మాంగా రచయిత “ఐచిరో ఓడా” సృష్టించిన ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మాంగా ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, 2023లో విడుదలైన మొదటి సీజన్‌తోనే 75కి పైగా దేశాల్లో నంబర్ వన్‌గా నిలిచి గ్లోబల్ ఫినామినన్‌గా మారింది.

“ఇనాకి గొడోయ్, మెకిన్యు, ఎమిలీ రడ్” ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కొత్త సీజన్‌లో “కేటీ సాగల్, జో మాంగనీల్లో” వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. “One Piece Season 2” మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana cm revanth reddy launching tholi mudda breakfast scheme for anganwadi children in assembly premises

Anganwadi Breakfast Scheme | సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త పథకం.....

Anganwadi Breakfast Scheme: తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ‘తొలి ముద్ద’(Tholi Mudda) పేరుతో ప్రత్యేక...
- Advertisement -
Chat on WhatsApp