Sunday, April 5, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅన్నపర్రులో ఓటర్లను నిర్లక్ష్యం చేసిన అధికారులు

అన్నపర్రులో ఓటర్లను నిర్లక్ష్యం చేసిన అధికారులు

-

Chat on WhatsApp

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఓటర్లు ఉదయం 9:20 గంటల నుంచే బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరీక్షించిన ప్రజలకు సమయం ముగిసిందని అధికారులు ప్రకటించారు. కానీ లైన్‌లో ఉన్న వారికి అవకాశం కల్పించాల్సిన నిబంధనను అధికారులు లెక్కచేయలేదు.

ఓటర్లకు ఇచ్చిన హామీని అధికారులు విస్మరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్‌లో ఉన్నవారికి ఓటు హక్కు కల్పించాలనే నిబంధనను తుంగలో తొక్కి అధికార పక్షానికి మద్దతుగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తూ అనేక మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో అధికార యంత్రాంగం తీరుపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓటు హక్కు ప్రతి పౌరునికి సమానంగా ఉండాలని, ఎలాంటి ప్రాఘట్యతలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అధికార పక్షానికి అనుకూలంగా జరిగిన చట్ట విరుద్ధ చర్యగా అభివర్ణిస్తున్నారు.

సమయం అయిపోయిందనే పేరిట ఓటింగ్ ప్రక్రియను ఆపివేయడం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పైస్థాయి అధికారుల విచారణ జరపాలని, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp