తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు మూసీ నది పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర పిలుపుమేరకు మేడ్చల్ నియోజకవర్గ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారి ఆదేశాలతో పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు పెద్ద ఎత్తున పిలాయిపల్లి తరలి వెళ్లడం జరిగింది. టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ గారు,మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో ఘట్కేసర్ మండల హయత్ నగర్ మండల్ కి సంబంధించి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులకు మహిళ రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, కార్పొరేషన్లు,మునిసిపాలిటీలు అధ్యక్ష కార్యదర్శులు,మేయర్లు, డిప్యూటీ మేయర్లు,మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.








