Tuesday, March 17, 2026
No menu items!
Home Telangana Hyderabad Kadiyam Kavya | కాజీపేట కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి… అభివృద్ధిపై ఎంపీ కావ్య...

Kadiyam Kavya | కాజీపేట కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి… అభివృద్ధిపై ఎంపీ కావ్య వ్యాఖ్యలు

0
11
mp kavya speaking in lok sabha about kazipet railway zone and telangana development projects
mp kavya speaking in lok sabha about kazipet railway zone and telangana development projects

Kadiyam Kavya: వరంగల్‌ ఎంపీ కడియం కావ్య లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్(kazipet railway zone) లేదా బలమైన సబ్‌జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. కాజీపేట జంక్షన్‌ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అండర్ టన్నెల్ నిర్మాణం చేపట్టాలని, ప్రతిపాదిత రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను వేగంగా ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ యూనిట్‌లో స్థానికులకు ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నుంచి హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణ నిర్ణయాన్ని స్వాగతించిన ఆమె, రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించి పరిశ్రమలు, లాజిస్టిక్స్ పార్క్‌లతో అనుసంధానం చేయాలని సూచించారు. వరంగల్ నుంచి పుష్‌పుల్ రైలు ప్రారంభం కూడా అవసరమని పేర్కొన్నారు.

ఇక కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం, 2019-20 నుంచి 2023-24 వరకు తెలంగాణలో సీఎస్‌ఆర్ కింద రూ.3,857 కోట్లు ఖర్చు కాగా, అందులో 53% హైదరాబాద్‌లోనే వినియోగించబడింది. విద్యారంగానికి అత్యధికంగా 34.68% నిధులు కేటాయించబడ్డాయి.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి రాష్ట్రం నుంచి రెండు ప్రతిపాదనలు కేంద్రానికి చేరినట్లు మంత్రి టోకన్ సాహు తెలిపారు. 76.4 కిమీ మరియు 86.1 కిమీ ప్రాజెక్టులపై పరిశీలన కొనసాగుతోంది.

స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్, కరీంనగర్ నగరాల్లో 85% పనులు పూర్తయ్యాయి. మొత్తం రూ.2,895 కోట్లలో రూ.2,520 కోట్ల పనులు పూర్తికాగా, మిగిలిన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

తెలంగాణ డిస్కంల అప్పులు 2025 మార్చి నాటికి రూ.59,230 కోట్లకు చేరినట్లు కేంద్రం వెల్లడించింది.

YouTube thumbnailYouTube icon