వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలులో పర్యటించారు. జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఆయన హాజరయ్యారు. వధూవరులు డాక్టర్ చతుర, డాక్టర్ నిఖిల్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
కన్వెన్షన్ సెంటర్ వద్ద జగన్ రావడంతో పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు ఆయనను చూడటానికి చేరుకున్నారు. జగన్ అందరికీ అభివాదం చేస్తూ వారికి ఆనందాన్ని కలిగించారు. కర్నూలు పర్యటన సందర్భంగా జగన్ కి అభిమానులు ఘన స్వాగతం పలికారు.
జగన్ బెంగళూరులో ఉన్న తన నివాసం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన రిసెప్షన్ కార్యక్రమాన్ని సంతోషంగా ముగించుకున్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే తాడేపల్లికి బయలుదేరారు.
తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న జగన్ కీలక వైసీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్టీ పనితీరుపై చర్చలు జరుపుతారని సమాచారం.