Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeOthersడిప్యూటీ సీఎం విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందన

డిప్యూటీ సీఎం విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందన

మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పవన్ కల్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారని, అలాంటప్పుడు లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాల్సిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, “లోకేశ్ టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారు, దానికి తగ్గట్టుగానే ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించాం” అని అన్నారు.

బుచ్చయ్య చౌదరి వైసీపీ హయాంలో రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోయారని ఆరోపించారు. అయితే ప్రస్తుతం విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడులు రాబోతున్నాయని, కేంద్ర సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. “ఈ ఎన్నికల హామీలను మా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది” అని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. అలాగే, ఏపీ, తెలంగాణ ఉమ్మడి ఆస్తుల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున దోపిడీ చేశారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆయన చెప్పిన ప్రకారం, “వివిధ కేసులలో విజయసాయిరెడ్డి దోచుకున్న వేల ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపాయలు” అని మండిపడ్డారు. “ఈ కేసుల నుండి తప్పించుకోవడానికే ఆయన రాజీనామా చేశారని” ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన ఎవరైనా శిక్ష పడాల్సిందేనని బుచ్చయ్య చౌదరి చెప్పారు.

అంతేకాకుండా, “విజయసాయిరెడ్డిని బీజేపీ చేర్చుకుంటుందని నాకు అనిపించడం లేదు. త్వరలోనే వైసీపీలో అందరూ తప్పుకుంటారు, రాబోయే రోజుల్లో ఆ పార్టీ కనుమరుగు అవుతుంది” అని జోస్యం చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular