Gold Rates Today | పసిడి మగువలకు మళ్ళీ షాక్….పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం దూకుడు

gold rates today in india bullion market gold rates today in india bullion market

Gold Rates Today: పసిడి మగువలకు మళ్ళీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చాయి. పసిడి ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తులం బంగారంపై “రూ.1,470 పెరుగుదల” నమోదైంది.

అదే సమయంలో వెండి ధరల్లో మాత్రం కొంత ఉపశమనం లభించింది. కిలో వెండిపై “రూ.5,000 తగ్గుదల” కనిపించింది.

బులియన్ మార్కెట్‌లో “24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620” వద్ద ట్రేడవుతోంది. అలాగే “22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,45,400″కు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,970 స్థాయిలో నమోదైంది.

వెండి ధరలు ఈరోజు తగ్గాయి. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో “కిలో వెండి ధర రూ.3,35,000′ వద్ద అమ్ముడవుతోంది. అయితే హైదరాబాద్‌, చెన్నై మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర “రూ.3,55,000″గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి ధర “రూ.3,35,000″గా కొనసాగుతోంది.

also read:WHO Exit: డబ్ల్యూహెచ్‌ఓ నుంచి బయటకు వచ్చిన అమెరికా.. కారణాలు ఇవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *